Govt. Schemes

AP New NTR Bharosa Pensions 2026: కొత్త పెన్షన్ నిబంధనల్లో కీలక మార్పు.. ఇంటి పన్ను నంబర్ తప్పనిసరి కాదు.

calendar_month September 9, 2026 person chitra

AP New NTR Bharosa Pensions 2026: కొత్త పెన్షన్ నిబంధనల్లో కీలక మార్పు.. ఇంటి పన్ను నంబర్ తప్పనిసరి కాదు.

AP New NTR Bharosa Pensions 2026:

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో అడిగే హౌస్ ట్యాక్స్ అసెస్‌మెంట్ నంబర్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త పెన్షన్ దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిబంధనలో సడలింపు ఇచ్చినట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ద్వారా కొత్త పెన్షన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హత ఉన్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఇంటి పన్ను అసెస్‌మెంట్ నంబర్‌పై కీలక సడలింపు :

కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఇంటి పన్ను ఎసెస్మెంట్ నంబర్ విషయంలో పలువురు దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం హౌస్ ట్యాక్స్ అసెస్‌మెంట్ నంబర్‌ను తప్పనిసరి కాకుండా సడలింపు ఇచ్చింది.

ఈ మార్పు సెప్టెంబర్ 9 నుంచి అమల్లోకి వస్తుందని సంబంధిత సచివాలయాల ద్వారా సమాచారం అందుతోంది. దీంతో కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హులైన వారికి ప్రక్రియ మరింత సులభం కానుంది.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కు కావాల్సిన పత్రాలు :

కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

1. ఆధార్ కార్డు జిరాక్స్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

2. రైస్ కార్డు జిరాక్స్

3. ఓటర్ కార్డు జిరాక్స్

4. కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్

5. ఆదాయ ధ్రువీకరణ పత్రం జిరాక్స్

6. కరెంట్ మీటర్ నంబర్ (సొంత ఇల్లు/అద్దె ఇల్లు)

7. ఇంటి పన్ను నంబర్ (ఉంటే)

8. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్

9. ఆధార్ అప్‌డేట్ హిస్టరీ

10. భర్త మరణ ధ్రువీకరణ పత్రం – వితంతు పెన్షన్ కోసం

11. సదరం సర్టిఫికెట్ – దివ్యాంగుల పెన్షన్ కోసం

గమనిక: ఇంటి పన్ను అసెస్‌మెంట్ నంబర్ విషయంలో ప్రభుత్వం తాజాగా సడలింపు ఇచ్చినందున, దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత గ్రామ/వార్డు సచివాలయంలో తాజా వివరాలను నిర్ధారించుకోవడం మంచిది.

సెప్టెంబర్‌లో కొత్త పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియ :

అర్హులైన వారు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల సౌకర్యం కోసం సచివాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

మీకు సంబంధించిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకుని నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

ప్రక్రియ తేదీ
కొత్త పెన్షన్ దరఖాస్తులు సెప్టెంబర్ 16 వరకు
డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ 17–21
పెన్షన్ ఆమోద ప్రక్రియ సెప్టెంబర్ 25–26
కొత్త పెన్షన్ ప్రారంభం అక్టోబర్ 1 నుంచి

ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పథకం కింద అర్హత ఉన్న వివిధ వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా:

వృద్ధులు
వితంతువులు
ఒంటరి మహిళలు
దివ్యాంగులు
మత్స్యకారులు
చేనేత కార్మికులు
సంప్రదాయ వృత్తులపై ఆధారపడిన వారు
చెప్పులు కుట్టేవారు
కల్లు గీత కార్మికులు
ట్రాన్స్‌జెండర్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఇతర సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారులు

ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?

కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం అర్హులైన అభ్యర్థులు తమ పరిధిలోని గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాల జిరాక్స్ కాపీలను వెంట తీసుకెళ్లాలి.

దరఖాస్తు స్వీకరించిన తర్వాత సంబంధిత అధికారులు పత్రాలను పరిశీలించి, అర్హతను నిర్ధారిస్తారు. అనంతరం ప్రభుత్వ ఆమోదం పొందిన అర్హులైన లబ్ధిదారులకు అక్టోబర్ 1 నుంచి కొత్త పెన్షన్ అందించనున్నట్లు సమాచారం.

ముఖ్యంగా గమనించాల్సిన విషయం :

కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు సెప్టెంబర్ 16లోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడం మంచిది. ఆధార్, రైస్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, సంబంధిత కేటగిరీకి అవసరమైన ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.

Application Form For New Pensions – Download

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *